ఒరేయ్‌ రసగుల్లా! - పట్టాభికి వర్మ స్ట్రాంగ్ కౌంటర్

నేను బ్యాడ్ డైరెక్టర్ అయితే అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ టెన్షన్ ఎందుకమ్మా?. రసగుల్లా మొత్తగా, తియ్యగా ఉండాలి. నువ్వేదో మిరపకాయలా ఫీల్ అయితే చండాలంగా ఉంటుంది.

Advertisement
Update: 2022-10-29 07:57 GMT

టీడీపీ నేత పట్టాభిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. తాను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడంపై పట్టాభి రామ్‌ విమర్శలు చేయడంపై వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పట్టాభిని రసగుల్లా అంటూ ఎద్దేవా చేశారు వర్మ.

''గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు బ్యాచ్‌ మొత్తం ఎందుకు అంత హైరానా పడుతున్నారో అర్థం కావడం లేదు. వాడు ఎవడో పట్టాభి భీమో.. రామో ఉన్నాడు.. పట్టాభి రామ్‌ అనుకుంటా. వాడు ముద్దుగా, బొద్దుగా రసగుల్లలా ఉంటాడు. ఒరేయ్‌ రసగుల్లా !. నేను జగన్‌ను ఎందుకు కలిశానో అన్నది కూడా తెలియకుండా నువ్వు అలా మాట్లాడితే ఎలా?.

నేను బ్యాడ్ డైరెక్టర్ అయితే అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ టెన్షన్ ఎందుకమ్మా?. రసగుల్లా మొత్తగా, తియ్యగా ఉండాలి. నువ్వేదో మిరపకాయలా ఫీల్ అయితే చండాలంగా ఉంటుంది. బీపీ వచ్చి చస్తావ్. నిన్ను చూస్తే బుగ్గ గిల్లాలి అనిపిస్తుంది. అసలు సినిమా ఏంటో ? సబ్జెక్ట్ ఏంటో కూడా చెప్పకముందే నీకు నువ్వు ఊహించేసుకుని భయపడిపోయి, నీ పార్టీ వాళ్లందరినీ భయపడితే ఎలా రసగుల్లా?. నీ అవసరం ఎవరికీ ఉండకపోచ్చు. కానీ కుటుంబానికి అవసరం ఉంటుందని అనుకుంటున్నా. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తా!. రసగుల్ల తర్వాత నీఅంతటి ముద్దుగా ఉండే పదార్ధాన్ని నేను చూడలేదు. ఇంకో రెండు రసగుల్లాలు తిని ఇంట్లో కూర్చో. ఇలాగే పేలితో బీపీ వచ్చి పోతావ్'' అంటూ పట్టాభిరామ్‌కు రామ్‌గోపాల్ వర్మ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

జగన్‌ను ఆర్జీవిని కలవడంపై ఇది వరకు స్పందించిన పట్టాభి.. అతడొక ఫ్లాప్ డైరెక్టర్ అని, రామ్ గోపాల్ వర్మ గురించి మట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోబోమని, ఓ ప్లాప్ డైరెక్టర్‌ను పక్కన పెట్టుకుని సినిమా తీయించుకుని ఓట్లు సంపాదించుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారారని పట్టాభి విమర్శించారు. ఈ వ్యాఖ్యలకే వర్మ కౌంటర్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News