పుట్టినరోజు వేడుకల వేళ విషాదం – లారీని ఆటో ఢీకొనడంతో నలుగురు మృత్యువాత

మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్‌ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు యానాంలో ఆదివారం రాత్రి వేడుకలు జరుపుకున్నారు.

Advertisement
Update: 2024-04-29 08:54 GMT

పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు యానాం వెళ్లిన యువకులు.. వేడుకల అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న 8 మందిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్‌ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు యానాంలో ఆదివారం రాత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వగ్రామానికి ఆటోలో బయలుదేరిన ఆ యువకులు సరిగ్గా రాత్రి 12.30 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శ్రీ వనువులమ్మ గుడి సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న చేపల లోడు లారీ వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలవ్వ‌గా, వారిని ఆస్పత్రికి తరలించారు. అమలాపురం రూరల్‌ సీఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో పుట్టినరోజు నాడే కొల్లాబత్తుల జతిన్‌ కూడా మృతిచెందడం బాధాక‌రం. మృతుల్లో మామిడికుదురు మండలానికి చెందిన సాపే నవీన్‌ (22), కొల్లాబత్తుల జతిన్‌ (26), నల్లి నవీన్‌కుమార్‌ (27), పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్‌ (18) ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    
Advertisement

Similar News