Vishal Ratnam | సెన్సార్ పూర్తి చేసుకున్న రత్నం

Vishal's Ratnam Movie - రత్నం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశాల్. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

Advertisement
Update: 2024-04-25 13:40 GMT

యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా పేరిట 2 యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడోసారి రత్నంతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయింది.

జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్ లో రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి సైతం రత్నం మీద పడంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

రిలీజ్ కు ఒక రోజు ముందు సెన్సార్ సభ్యులు సినిమాను చూసి, యు/ఏ సర్టిఫికెట్‌ అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని మెచ్చుకున్నారు. ఈమధ్య కాలంలో తెలుగులో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన విశాల్, రత్నంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News