Veerasimha Reddy: రేపే ఫస్ట్ సింగిల్ రిలీజ్

Balakrishna's VeeraSimha Reddy: వీరసింహారెడ్డి పాటలతో సందడి చేయబోతున్నాడు. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. జై బాలయ్య అనే లిరిక్స్ తో ఈ సాంగ్ ఉంటుంది.

Advertisement
Update: 2022-11-24 14:34 GMT

బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది.

మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కు డేట్ లాక్ చేశారు. 'వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ జై బాలయ్య రేపు రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ''రాజసం నీ ఇంటి పేరు' అని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ లుక్ ఆకట్టుకునేలా ఉంది. వైట్ అండ్ వైట్ లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్ గా కనిపించాడు బాలకృష్ణ.

చాలా సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులు నినాదం 'జై బాలయ్య'. ఇదే నినాదంతో అఖండ లో పాట కూడా వచ్చింది. సూపర్‌హిట్ పాటను స్కోర్ చేసిన తమన్ ఈసారి వీరసింహారెడ్డి కోసం మరో మాస్ నంబర్ జై బాలయ్య ను స్కోర్ చేశాడు. ఇలా ఒకే స్లోగన్ తో 2 పాటలు కంపోజ్ చేసే అవకాశం తమన్ కు దక్కింది.

ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ కాగా, దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Tags:    
Advertisement

Similar News