శర్వా సరసన దివ్యాంశ కౌశిక్

మహాసముద్రం ప్రాజెక్టు ఒక్కో అడుగు మెల్లమెల్లగా ముందుకేస్తోంది. చాన్నాళ్ల కిందటే స్టోరీ, స్క్రీన్ ప్లే లాక్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి.. హీరోలను ఒప్పించడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఎట్టకేలకు శర్వానంద్ ను హీరోగా ఒప్పించగలిగాడు. హీరోను పట్టడం కోసం అజయ్ భూపతి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు హీరోయిన్ వేట కూడా ఇతగాడికి అంతే ఇబ్బందిగా మారింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంతను అనుకున్నారు. కానీ నాగచైతన్య తప్పుకోవడంతో ఆటోమేటిగ్గా సమంత కూడా […]

Advertisement
Update: 2020-07-20 23:00 GMT

మహాసముద్రం ప్రాజెక్టు ఒక్కో అడుగు మెల్లమెల్లగా ముందుకేస్తోంది. చాన్నాళ్ల కిందటే స్టోరీ, స్క్రీన్ ప్లే లాక్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి.. హీరోలను ఒప్పించడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఎట్టకేలకు శర్వానంద్ ను హీరోగా ఒప్పించగలిగాడు. హీరోను పట్టడం కోసం అజయ్ భూపతి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు హీరోయిన్ వేట కూడా ఇతగాడికి అంతే ఇబ్బందిగా మారింది.

ముందుగా ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంతను అనుకున్నారు. కానీ నాగచైతన్య తప్పుకోవడంతో ఆటోమేటిగ్గా సమంత కూడా తప్పుకుంది. ఆ తర్వాత రాశిఖన్నాను అనుకున్నారు. కానీ ఆమె ఇంకా కాల్షీట్లు ఇచ్చినట్టు లేదు. మధ్యలో లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకొచ్చింది.

ఓవైపు మెయిన్ హీరోయిన్ కోసం ఇలా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సెకెండ్ హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు అజయ్ భూపతి. దివ్యాంశ కౌశిక్ ను సెకెండ్ లీడ్ గా తీసుకున్నాడు. నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. మళ్లీ ఇన్నాళ్లకు “మహాసముద్రం” రూపంలో మరో అవకాశం అందుకుంది.

Tags:    
Advertisement

Similar News