పళ్లు రాలగొట్టుకోనంటున్న ఝాన్సీ

చాలామందికి తెలియని విషయం ఒకటుంది. యాంకర్ కమ్ నటి ఝాన్సీ చాలా ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం ఆమె నైజం. అదే ఆమెకు శత్రువుల్ని తీసుకొస్తే, మంచి ఆప్తుల్ని కూడా అందించింది. తాజాగా మరోసారి తనలోని ఆ నైజాన్ని ప్రదర్శించారు ఝాన్సీ. బిగ్ బాస్ కార్యక్రమంపై ఘాటుగా స్పందించి తన మార్క్ చాటుకున్నారు. “బిగ్ బాస్ ఆఫర్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ హౌజ్ లోకి రానని చెప్పాను. ఇప్పుడూ వెళ్లను, ఇకపై […]

Advertisement
Update: 2020-05-17 01:58 GMT

చాలామందికి తెలియని విషయం ఒకటుంది. యాంకర్ కమ్ నటి ఝాన్సీ చాలా ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం ఆమె నైజం. అదే ఆమెకు శత్రువుల్ని తీసుకొస్తే, మంచి ఆప్తుల్ని కూడా అందించింది.

తాజాగా మరోసారి తనలోని ఆ నైజాన్ని ప్రదర్శించారు ఝాన్సీ. బిగ్ బాస్ కార్యక్రమంపై ఘాటుగా స్పందించి తన మార్క్ చాటుకున్నారు.

“బిగ్ బాస్ ఆఫర్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ హౌజ్ లోకి రానని చెప్పాను. ఇప్పుడూ వెళ్లను, ఇకపై కూడా వెళ్లను. తెలిసి రాయితో పళ్లు ఊడగొట్టుకుంటారా ఎవరైనా. 4 గోడల మధ్య నన్ను నేను బాధపెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు.”

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసింది ఝాన్సీ… తెలుగులో టాప్ మోస్ట్ సీనియర్ యాంకర్లలో ఒకరైన ఝాన్సీ.. బిగ్ బాస్ కార్యక్రమంపై తనది కేవలం వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. అది సూపర్ హిట్టయింది కాబట్టి ఎక్కువమంది ప్రజలు దాన్ని ఆదరించారనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు.

అయితే తను మాత్రం బిగ్ బాస్ కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. బహుశా.. తనకు ఉన్నంత స్థాయి మిగతా పార్టిసిపెంట్లకు ఉండదని ఝాన్సీ ఫీల్ అవుతున్నారేమో.

Tags:    
Advertisement

Similar News