ఇంత రిస్క్ అవసరమా మహేష్

టైమ్ దొరికితే భార్యా పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. పిల్లలకు శెలవులొస్తే చాలు వాళ్లను ఏదో ఒక దేశానికి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు కూడా సితార, గౌతమ్ కు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. దీంతో ఈసారి లండన్ టూర్ ప్లాన్ చేశాడు మహేష్. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడీ విదేశీ పర్యటనలు అవసరమా అంటున్నారు మహేష్ అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం 130 దేశాల్లో కరోనా […]

Advertisement
Update: 2020-03-11 23:08 GMT

టైమ్ దొరికితే భార్యా పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. పిల్లలకు శెలవులొస్తే చాలు వాళ్లను ఏదో ఒక దేశానికి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు కూడా సితార, గౌతమ్ కు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. దీంతో ఈసారి లండన్ టూర్ ప్లాన్ చేశాడు మహేష్. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడీ విదేశీ పర్యటనలు అవసరమా అంటున్నారు మహేష్ అభిమానులు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం 130 దేశాల్లో కరోనా తన ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి టైమ్ లో చల్లగా ఉండే లండన్ లాంటి ప్రాంతాలకు మహేష్ వెళ్లాలని అనుకోవడం ఏమాత్రం మంచి నిర్ణయం కాదంటున్నారు అతడి అభిమానులు. ఈ ఒక్క వేసవికి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని, ఎంచక్కా ఇంట్లో ఉంటే అంతకంటే సురక్షితం ఇంకేదీ ఉండదని చెబుతున్నారు.

అభిమానులు చెబుతున్నది కూడా నిజమే. ఈ కరోనా టైమ్ లో మహేష్ తన టూర్ ను రద్దు చేసుకుంటేనే బెటర్. మొన్నటికి మొన్న ఇలానే అందరూ వద్దంటున్నా షూటింగ్ కోసం జార్జియా వెళ్లాడు ప్రభాస్. అతడిపై ఓ రేంజ్ లో చిరాకుపడ్డారు ఫ్యాన్స్. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది.

Tags:    
Advertisement

Similar News