అది మహేష్ బాబు కోసం రాసిన కథే

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి 3-4 రోజులైంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుపై మరో కొత్త చర్చ మొదలైంది. విజయ్, పూరి మధ్య ఏ కథ అయితే చర్చకొచ్చిందో, అది గతంలో మహేష్ బాబుకు పూరి వినిపించిన జనగణమన అనే విషయం తాజాగా బయటకొచ్చింది. జనగణమన సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా వెయిటింగ్. కానీ తాజాగా మహేష్-పూరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇక […]

Advertisement
Update: 2019-08-16 01:10 GMT

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి 3-4 రోజులైంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుపై మరో కొత్త చర్చ మొదలైంది. విజయ్, పూరి మధ్య ఏ కథ అయితే చర్చకొచ్చిందో, అది గతంలో మహేష్ బాబుకు పూరి వినిపించిన జనగణమన అనే విషయం తాజాగా బయటకొచ్చింది.

జనగణమన సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా వెయిటింగ్. కానీ తాజాగా మహేష్-పూరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇక ఈ సినిమా రాదని అంతా ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో మహేష్ పై కోపంతో ఈ కథను విజయ్ దేవరకొండతో పూరి ప్లాన్ చేశాడని ఇప్పటికే లీకులు షురూ అయ్యాయి. విజయ్ మేనరిజమ్స్ కు తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేసి, జనగణమన కథనే కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారట.

ప్రస్తుతానికైతే ఇది గాసిప్ స్థాయిలో మాత్రమే ఉంది. ఇది నిజం అవునా కాదా అనే విషయాన్ని చెప్పగలిగే వ్యక్తి కేవలం పూరి జగన్నాధ్ మాత్రమే. కానీ ఆయన మాత్రం మరో 3 నెలలు ఎవ్వరికీ కనిపించడు. ఫిజికల్ గా ఫిట్ గా తయారైన తర్వాతే కొత్త సినిమా స్టార్ట్ చేస్తానని గతంలో ప్రకటించాడు పూరి. చెప్పినట్టుగానే ఇప్పుడు పూర్తిగా బయటకు రావడం మానేశాడు. తన ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాడు.

Tags:    
Advertisement

Similar News