ఎవరి హద్దుల్ని వారు గుర్తిస్తే మంచిది

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ భామ ఒక్క స్టార్ హీరో సరసన కూడా ఛాన్స్ దక్కించుకోలేదు. ఇలాంటి టైం లో అనుపమ ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, మీటూ ఉద్యమం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ భామ ఇండస్ట్రీ లోని మనుషులని ఉద్దేశిస్తూ “చూసే కళ్ళని బట్టే లోకం కనిపిస్తుంది. దూరం నుంచి ఈ పరిశ్రమని చూసేవాళ్ళు […]

Advertisement
Update: 2018-12-09 00:34 GMT

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ భామ ఒక్క స్టార్ హీరో సరసన కూడా ఛాన్స్ దక్కించుకోలేదు.

ఇలాంటి టైం లో అనుపమ ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, మీటూ ఉద్యమం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ భామ ఇండస్ట్రీ లోని మనుషులని ఉద్దేశిస్తూ “చూసే కళ్ళని బట్టే లోకం కనిపిస్తుంది. దూరం నుంచి ఈ పరిశ్రమని చూసేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారికి మాత్రమే ఈ రంగం గురించి పూర్తిగా తెలుస్తుంది. నేను నా వరకు ఎలా ఉన్నాను, ఎవరితో ఎలా ఉన్నాను అనేది మాత్రం ముఖ్యం. ఎవరి హద్దుల్లో వారు ఉంటే ఎవరికీ ఎటువంటి సమస్య రాదు. దశాబ్దాలుగా చాలామంది కథానాయికలు వస్తున్నారు. కొంతమంది స్టార్లుగా మారారు. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమని నమ్ముకుని, ఇక్కడే ఉన్నారంటే వాళ్లకు ఎలాంటి సమస్యలూ లేనట్టేగా. అంటే ఇక్కడ ఎవరి లిమిట్స్ లో వారు ఉన్నారు కాబట్టే వారు ఇంకా హ్యాపీ గా ఉన్నారు” అని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.

Tags:    
Advertisement

Similar News