మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అభివృద్ధి ప‌నుల  విష‌యంలో లేనిది ఉన్న‌ట్లుగా చూపిస్తోన్న ఆయ‌న్ను గాడిద మీద ఎక్కించి ఊరేగించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన మ‌ధుయాష్కీ సీఎం కుటుంబంపై విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం సెటిల్ మెంట్ల‌తో కాలం గడుపుతోంద‌ని ఆరోపించారు. అల్లుడు ఇసుక వ్యాపారం, కూతురు భూముల సెటిల్‌మెంట్లు, కుమారుడు ప్ర‌త్యేక విమానాల్లో విదేశీ ప్ర‌యాణాల్లో మునిగిపోయార‌ని విమ‌ర్శించారు. వీరంతా ప్ర‌జలసొమ్మును త‌న […]

Advertisement
Update: 2016-08-15 21:00 GMT
తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అభివృద్ధి ప‌నుల విష‌యంలో లేనిది ఉన్న‌ట్లుగా చూపిస్తోన్న ఆయ‌న్ను గాడిద మీద ఎక్కించి ఊరేగించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన మ‌ధుయాష్కీ సీఎం కుటుంబంపై విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం సెటిల్ మెంట్ల‌తో కాలం గడుపుతోంద‌ని ఆరోపించారు. అల్లుడు ఇసుక వ్యాపారం, కూతురు భూముల సెటిల్‌మెంట్లు, కుమారుడు ప్ర‌త్యేక విమానాల్లో విదేశీ ప్ర‌యాణాల్లో మునిగిపోయార‌ని విమ‌ర్శించారు. వీరంతా ప్ర‌జలసొమ్మును త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కు దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ కుటుంబానికి అస‌లు రాష్ర్టా భివృద్ధి ఏమాత్రం సోయిలేద‌న్నట్లుగా ధ్వ‌జ‌మెత్తారు. మిష‌న్ భ‌గీర‌థ దేశంలోనే అతిపెద్ద కుంభ‌కోణ‌మ‌ని ఆరోపించారు. మ‌హ‌రాష్ట్రతో సాగునీటి విష‌యంలో ఒప్పందం జ‌రిగిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్న కేసీఆర్‌ను గాడిద మీద ఊరేగించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.
మ‌ధుయాష్కీ అంత‌టితో ఊరుకోలేదు. భూ వివాదాల్లో కేసీఆర్‌ స‌న్నిహితుల‌కు న‌యీం మ‌ధ్య త‌గాదాలు వ‌చ్చినందు వ‌ల్లే అత‌న్ని ఎన్‌కౌంట‌ర్ చేయించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పోనీ అంత‌టితో ఊరుకున్నాడా? అంటే అదీ లేదు.
కేవీపీ రామ‌చంద్ర‌రావు – కేసీఆర్‌లు బినామీ పేర్ల‌తో తెలంగాణ‌లో ప‌లు వ్యాపారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని విలేక‌రుల‌కు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News