షర్మిల వెనక చంద్రబాబు, రేవంత్ రెడ్డి - జగన్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు షర్మిలను నడిపిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు జగన్. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌ పార్టీ సైతం చంద్రబాబు చెప్పు చేతల్లో నడుస్తోందన్నారు.

Advertisement
Update: 2024-04-29 12:51 GMT

కడప పార్లమెంట్ స్థానం నుంచి తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై స్పందించారు జగన్. ఇండియా టుడే రిపోర్టర్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్‌.. షర్మిల పోటీ చేయడంపై తనకేమి బాధ లేదన్నారు. కానీ షర్మిలకు డిపాజిట్ రాదన్న విషయమే తనను ఎక్కువగా బాధిస్తుందన్నారు. షర్మిల చేస్తుంది సరికాదన్నారు. ఛార్జీషిట్‌లో తన తండ్రి పేరును చేర్చింది కాంగ్రెసేనన్నారు. అదే పార్టీ తనపై తప్పుడు కేసులు బనాయించిందన్నారు. తనపై కేసుల వెనుక ఉన్నది కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలేనన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు షర్మిలను నడిపిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు జగన్. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌ పార్టీ సైతం చంద్రబాబు చెప్పు చేతల్లో నడుస్తోందన్నారు. తాను కేవలం ఒక పార్టీపై పోరాటం చేయడం లేదన్నారు జగన్.

గడిచిన ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాన‌ని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 20 ఎంపీ సీట్లు తక్కువ వస్తే మద్దతిస్తారా అన్న రిపోర్టర్‌ ప్రశ్నను.. కొట్టిపారేశారు జగన్. వారంతా కలిసికట్టుగా తనపై పోరాటం చేస్తున్నప్పుడు అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు.

Tags:    
Advertisement

Similar News