అత్త ప్రేమలో అల్లుడు.. దగ్గరుండి ఇద్దరికి పెళ్లి చేయించిన మామ

రాష్ట్రంలోని బంకా జిల్లా ఛత్రపాల్ పంచాయతీ హీరో మోతీగావ్ కు చెందిన దిలేశ్వర్ దార్వే(55)కు భార్య గీతాదేవి (45) ఉన్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉండగా.. సికిందర్ యాదవ్ అనే యువకుడికి ఇచ్చి కొన్నేళ్ల కిందట వివాహం జరిపించారు.

Advertisement
Update: 2024-04-29 14:04 GMT

బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్ర పెళ్లి జరిగింది. భార్య చనిపోవడంతో పిల్లనిచ్చిన అత్తమామల దగ్గర అల్లుడు ఉంటుండగా.. అతడు అత్త ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న మామ ఆ ఇద్దరికీ దగ్గరుండి మరీ గ్రామస్తుల సమక్షంలో పెళ్లి చేశాడు. సొంత అల్లుడికి భార్యనిచ్చి వివాహం చేయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలోని బంకా జిల్లా ఛత్రపాల్ పంచాయతీ హీరో మోతీగావ్ కు చెందిన దిలేశ్వర్ దార్వే(55)కు భార్య గీతాదేవి (45) ఉన్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉండగా.. సికిందర్ యాదవ్ అనే యువకుడికి ఇచ్చి కొన్నేళ్ల కిందట వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట సికిందర్ భార్య మరణించింది. అప్పటినుంచి సికిందర్ అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అతడు అత్త గీతాదేవికి దగ్గర అయ్యాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. వీరిద్దరి వ్యవహారాన్ని దిలేశ్వర్ గుర్తించాడు. గ్రామ పెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీలో తన అత్త గీతాదేవిని తాను ప్రేమించినట్లు సికిందర్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దిలేశ్వర్ గ్రామస్తుల అంగీకారంతో తన అల్లుడికి భార్యను ఇచ్చి అందరి సమక్షంలో వివాహం జరిపించాడు.

అంతేకాదు దిలేశ్వర్ తన భార్య అల్లుడి మధ్య కోర్టు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. పెళ్లి అనంతరం సికిందర్ గీతాదేవిని తీసుకొని తన సొంతూరికి తీసుకెళ్లిపోయాడు. కాగా, పిల్లనిచ్చిన అత్తను అల్లుడు ప్రేమించడం.. ఇది తెలిసిన మామ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    
Advertisement

Similar News