పవన్ సినిమా నుంచి శృతిహాసన్ ఔట్...?

గబ్బర్ సింగ్ జోడీ మరోసారి రిపీట్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. మేకర్స్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక పవన్-శృతిహాసన్ కలిసి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని అంతా అనుకున్నారు. కానీ ఊహించని పరిణామం జరిగింది. పవన్ సినిమా నుంచి శృతిహాసన్ ను తప్పించేశారు. శృతిహాసన్ ను తప్పించేశారు అనే కంటే… శృతిహాసనే తప్పుకుంది అనడం కరెక్ట్. నిజానికి పవన్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అవకాశం రావడమే గొప్ప అనుకుంటారు […]

Advertisement
Update: 2016-06-03 23:26 GMT
గబ్బర్ సింగ్ జోడీ మరోసారి రిపీట్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. మేకర్స్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక పవన్-శృతిహాసన్ కలిసి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని అంతా అనుకున్నారు. కానీ ఊహించని పరిణామం జరిగింది. పవన్ సినిమా నుంచి శృతిహాసన్ ను తప్పించేశారు. శృతిహాసన్ ను తప్పించేశారు అనే కంటే… శృతిహాసనే తప్పుకుంది అనడం కరెక్ట్. నిజానికి పవన్ సినిమాల విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అవకాశం రావడమే గొప్ప అనుకుంటారు హీరోయిన్లు. కానీ శృతిహాసన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని సైతం వదులుకుంది. దీంతో అంతా అవాక్కయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం… కాల్షీట్ల ప్రాబ్లమ్ వల్లనే శృతిహాసన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
తండ్రి కమల్ హాసన్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు శృతిహాసన్ రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఏకంగా 2 నెలల పాటు అమెరికాలో ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాల్షీట్లు ఇచ్చేసింది శృతి. 2 నెలల పాటు అమెరికాలో ఫిక్స్ అయిపోవాలని నిర్ణయించుంది. ఇలాంటి టైమ్ లో పవన్ సరసన మరోసారి ఛాన్స్ రావడంతో…. ఎలాగోలా కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయొచ్చని మొదట ఓకే చెప్పింది. కానీ కమల్ తో చర్చించిన తర్వాత పవన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి మొగ్గుచూపింది శృతిహాసన్. అందుకే జూన్ 2 నాటికే సెట్స్ పైకి రావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలపైకి రాలేదని తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News