అఖిల్ సినిమాపై మరోసారి అనుమానాలు

అఖిల్ సినిమాకు సంబంధించి తెరవెనక ఏదో జరుగుతోంది. గ్రాఫిక్స్ కాలేదని నాగార్జున బాహాటంగా చెప్పినప్పటికీ, ఇంకేదో జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని అఖిల్ ఖండించాడు. మరోవైపు గ్రాఫిక్స్ కంప్లీట్ అయిపోయాయని దర్శకుడు ప్రకటించాడు. మరి అఖిల్ సినిమా విడుదలకు ఇంకా అడ్డేంటి.. దీపావళికి వచ్చేస్తున్నామని ఘనంగా ప్రకటించవచ్చు కదా.. టైం కూడా తక్కువగానే ఉంది. కానీ అఖిల్ టీం మాత్రం మరోసారి మౌనాన్నే ఆశ్రయించింది. సినిమా విడుదలపై […]

Advertisement
Update: 2015-10-29 19:05 GMT
అఖిల్ సినిమాకు సంబంధించి తెరవెనక ఏదో జరుగుతోంది. గ్రాఫిక్స్ కాలేదని నాగార్జున బాహాటంగా చెప్పినప్పటికీ, ఇంకేదో జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని అఖిల్ ఖండించాడు. మరోవైపు గ్రాఫిక్స్ కంప్లీట్ అయిపోయాయని దర్శకుడు ప్రకటించాడు. మరి అఖిల్ సినిమా విడుదలకు ఇంకా అడ్డేంటి.. దీపావళికి వచ్చేస్తున్నామని ఘనంగా ప్రకటించవచ్చు కదా.. టైం కూడా తక్కువగానే ఉంది. కానీ అఖిల్ టీం మాత్రం మరోసారి మౌనాన్నే ఆశ్రయించింది. సినిమా విడుదలపై పెదవి విప్పడం లేదు. దీంతో మూవీకి సంబంధించి తెరవెనక ఏదో జరుగుతోందనే చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ సినిమాకు సంబంధించి లెక్కలు తేల్చే పనిలో పడ్డాడట నిర్మాత నితిన్. ఈ సినిమాను కొత్త హీరో అని కూడా చూడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అంత డబ్బు వెచ్చించడం లేదని తెలుస్తోంది. దీంతో సినిమాను నష్టానికి థియేటర్లలోకి దించాల్సి వస్తోందని సమాచారం. ఈ ఆర్థిక లావాదేవీల కారణంగానే అఖిల్ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి వెనకముందు ఆలోచిస్తున్నారు మేకర్స్.
Tags:    
Advertisement

Similar News