ఈ వీకెండ్ మహేష్ తో మొదలు

గడిచిన వీకెండ్ అంతా బాహుబలి మేనియాతో ఊగిపోయింది ప్రేక్షక లోకం. ఈ వీకెండ్ ఆ మేనియా మహేష్ సొంతం కాబోతోంది. అప్పటికే బాహుబలి విడుదలై వారం రోజులు అయిపోతుంది కాబట్టి.. ఇక తన సినిమాకు ఏమాత్రం ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో శ్రీమంతుడ్ని తెరపైకి తెస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఆడియోను ఈ వీకెండ్.. అంటే 18వ తేదీనాడు గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శిల్పకళావేదికగా జరగనున్నఈ పాటల వేడుకను ప్రసారం చేసే హక్కుల్ని జీ-తెలుగు […]

Advertisement
Update: 2015-07-12 21:30 GMT
గడిచిన వీకెండ్ అంతా బాహుబలి మేనియాతో ఊగిపోయింది ప్రేక్షక లోకం. ఈ వీకెండ్ ఆ మేనియా మహేష్ సొంతం కాబోతోంది. అప్పటికే బాహుబలి విడుదలై వారం రోజులు అయిపోతుంది కాబట్టి.. ఇక తన సినిమాకు ఏమాత్రం ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో శ్రీమంతుడ్ని తెరపైకి తెస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఆడియోను ఈ వీకెండ్.. అంటే 18వ తేదీనాడు గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శిల్పకళావేదికగా జరగనున్నఈ పాటల వేడుకను ప్రసారం చేసే హక్కుల్ని జీ-తెలుగు ఛానెల్ దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. పైగా టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ట్యూన్స్ కూడా హిట్టయితే సినిమాకు మంచి హైప్ రావడం గ్యారెంటీ. వచ్చేనెల 7న శ్రీమంతుడు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. జగపతిబాబు, ఆమని, రాహుల్ రవీంద్రన్ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Tags:    
Advertisement

Similar News