ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్రకటించిన కేసీఆర్, 'దేశపతి'కి దక్కిన అవకాశం

మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు.

Advertisement
Update: 2023-03-07 11:20 GMT

తెలంగాణలో మార్చ్ 23 న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బారత రాష్ట్ర సమితి (BRS)తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రకటించారు.

మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు.

ఈ నెల 9న వీరు ముగ్గురు నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. అందుకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవాలని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News