ఈ నెల 18 న హైదరాబాద్ లో ఇండియా వర్సెస్ న్యూజీల్యాండ్ ఒన్ డే మ్యాచ్

టిక్కట్లు పేటీఎం లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. ఆన్లైన్ టికెట్ లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా అమ్ముతారు.

Advertisement
Update: 2023-01-11 16:47 GMT

ఈ నెల 18 న హైదరాబాద్ లో ఇండియా వర్సెస్ న్యూజీల్యాండ్ ఒన్ డే మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ లో టిక్కట్లు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.

టిక్కట్లు పేటీఎం లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. ఆన్లైన్ టికెట్ లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా అమ్ముతారు.

జనవరి 13న 6వేల టికెట్లు అమ్ముతారు

జనవరి 14న‌7వేల టికెట్లు

జనవరి 15 న 7వేల టికెట్లు

జనవరి 16న మిగతా టికెట్లు అమ్ముతారు. .

ఆన్లైన్ టికెట్ తీసుకునేవారు కేవలం 4టికెట్ లు మాత్రమే తీసుకోవాలి.

ఆన్ లైన్ లో టిక్కట్లు కొన్న వాళ్ళు Lb స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు ఉదయం 10 నుండి 3 గంటల లోపు టికెట్లు కలెక్ట్ చేసుకోవాలి.మ్యాచ్ కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి.

స్టేడియం కెపాసిటీ 39,112 సీట్లు కాగా కాంప్లమెటరి టికెట్లు 9695, 29,417 టికెట్స్ అమ్మకానికున్నాయి.

బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగ కుండా,పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అజారుద్దీన్ చెప్పారు.

జనవరి 14 న న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఇండియా టీం ఈ నెల 16న చేరుకుంటుంది.

Tags:    
Advertisement

Similar News