అంతలోనే మరో సినిమా స్టార్ట్ చేసిన శర్వా

ఓవైపు ఒకే ఒక జీవితం అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు శర్వానంద్. ఆ సినిమా ప్రచారం చేస్తూనే, మరోవైపు కొత్త సినిమా లాంఛ్ చేశాడు.

Advertisement
Update: 2022-09-06 04:35 GMT

హీరో శర్వానంద్ తన 33వ చిత్రాన్ని ప్రారంభించాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఓ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. నిర్మాతలతో పాటు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌ కొట్టగా, కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి మొదలవుతుంది.

ప్రస్థానం తర్వాత శర్వానంద్ చేస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా ఇదే. ఇందులో శర్వా సరనస రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో ప్రియమణి కనిపించనుంది.

అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండగా, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రాఫర్. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News