Prasanna Vadanam | కచ్చితంగా హిట్ అంటున్న నిర్మాత

Prasanna Vadanam - సుహాస్ నటించిన సినిమా ప్రసన్న వదనం. ఇది కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు నిర్మాత.

Advertisement
Update: 2024-04-29 16:55 GMT

సుహాస్ హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు.

ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత జెఎస్ మణికంఠ విలేకరులతో మాట్లాడాడు. ప్రసన్నవదనం జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.

"కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు సహా నిర్మాతగా చేశాను. ఓ స్నేహితుడి ద్వారా ప్రసన్న వదనం కథ నా దగ్గరకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు అర్జున్, సుకుమార్ గారి దగ్గర పని చేశారు. అర్జున్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సుహాస్ కి వినిపిస్తే ఆయనకి కూడా నచ్చింది. అలా ప్రాజెక్ట్ మొదలైంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా చేశాం. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బిజినెస్ పరంగా లాభాల్లో ఉన్నాం. మైత్రీ, హోంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది."

సుహాస్ కి యూనిక్ కాన్సెప్ట్స్, కథలు బాగా నప్పుతాయని.. ప్రసన్న వదనం కూడా అలాంటి కథే అంటున్నాడు మణికంఠ. అర్జున్ కథ చెప్పినప్పుడు ఎక్సయిటింగ్ గా అనిపించిందని, ఇప్పటివరకు ఆ ఎక్సయిట్ మెంట్ అలానే ఉందని అన్నాడు. ఇప్పటివరకు ఇలాంటి కథ ఇండియన్ సినిమాలో రాలేదంటున్నాడు మణికంఠ.

Tags:    
Advertisement

Similar News