కొత్త సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేసిన చిరు

బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది. సినిమాకు కీలకమైన షెడ్యూల్ ఇదేనంట.

Advertisement
Update: 2022-09-04 12:49 GMT

చిరంజీవి కొత్త సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు.

చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్, పవర్- ప్యాక్డ్ పాత్రలో చిరంజీవిని చూపించబోతున్నాడు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన దేవిశ్రీ ప్రసాద్, ఈ తాజా చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News