పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కంత్రీ..

చంద్రబాబు చెప్పే మాటలే పవన్ కళ్యాణ్ సభల్లో చెబుతుంటాడని.. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డబ్బింగ్ చెబుతున్నారని మండిపడ్డారు.

Advertisement
Update: 2023-06-29 14:02 GMT

ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన, టీడీపీలపై తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీ నేత నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు యాత్రల్లో పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పి కొట్టడంలో అంబటి ముందుంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కథానాయకుడు అని.. రాజకీయాల్లో మాత్రం కంత్రీ నాయకుడు అని మండిపడ్డారు. పవన్ తనకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడన్నారు.

వారాహి అంటే అమ్మవారి పేరు అని.. ఆయన తన వాహనానికి అమ్మవారి పేరు పెట్టుకుని.. ఆ వాహనాన్ని ఎక్కి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం తగదని సూచించారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని వెనకాల ఒక కథ ఉందన్నారు. అతడు రాజకీయాలకు అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబ‌టి.

చంద్రబాబు చెప్పే మాటలే పవన్ కళ్యాణ్ సభల్లో చెబుతుంటాడని.. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డబ్బింగ్ చెబుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ చేపట్టిన యువగళానికి అసలు గళమే లేదని అంబటి ఎద్దేవా చేశారు. ఇక టీడీపీకి చెందిన కొందరు నాయకులు బస్సు యాత్ర చేపట్టారని.. అది బస్సు యాత్ర కాదని తుస్సు యాత్ర అని ఎద్దేవా చేశారు. ఆ యాత్రకు అసలు జనాల్లో స్పందనే కనిపించడం లేదన్నారు. టీడీపీ బస్సు యాత్రకు కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని చెప్పారు.

అసలు టీడీపీలో ఉంటారో లేకుంటే మరో పార్టీకి మారతారో తెలియని కన్నా లక్ష్మీనారాయణ తనకు సెల్ఫీ ఛాలెంజ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని, అతడికి అంత నైతిక అర్హత ఉందా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News