PVC పైపుల లారీలో రూ.8 కోట్లు.. పుష్ప సీన్ రిపీట్‌

లారీలో పుష్ప మూవీ రేంజ్‌లో ఓ స్పెషల్‌ క్యాబిన్‌లో దాదాపు రూ.8 కోట్ల 40 లక్షల రూపాయలు గుర్తించారు. అయితే ఈ డబ్బుపై డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Update: 2024-05-09 03:35 GMT

ఏపీలో పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడవు ఉండడంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు దగ్గర పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

మెదక్ నుంచి PVC పైపుల లోడుతో గుంటూరు వెళ్తున్న లారీని తనిఖీ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. లారీలో పుష్ప మూవీ రేంజ్‌లో ఓ స్పెషల్‌ క్యాబిన్‌లో దాదాపు రూ.8 కోట్ల 40 లక్షల రూపాయలు గుర్తించారు. అయితే ఈ డబ్బుపై డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. 5 రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర చేసిన సోదాల్లో భారీగా నగలు పట్టుబడ్డాయి. విశాఖ నుంచి కాకినాడకు వస్తున్న సీక్వెల్ లాజస్టిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనంలో బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. సీజ్ చేసిన సొత్తు విలువ మార్కెట్‌లో రూ. 17 కోట్ల ఉంటుందని అంచనా.

Tags:    
Advertisement

Similar News