ఆనంను తోసి ప‌డేశారు..

కొమ్మి లక్ష్మీ నాయుడిపై ఓ వర్గం దాడికి దిగడంతో గొడవ మొదలైంది. తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

Advertisement
Update: 2024-05-09 07:55 GMT

ఎన్నికలవేళ టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వర్గపోరు అధిష్టానంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మినాయుడితో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డికి తెలుగు తమ్ముళ్లు షాకిచ్చారు. చేజర్ల మండలం నాగల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా.. వైసీపీ నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వివాదం చెలరేగింది.

ఆనంను తోసేశారు..

కొమ్మి లక్ష్మీ నాయుడిపై ఓ వర్గం దాడికి దిగడంతో గొడవ మొదలైంది. తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తమ్ముళ్ల ఫైటింగ్ ఆనం ప్రాణాలమిదికొచ్చింది. ఒక్కసారిగా దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఆనం కార్యకర్తలను వారించే ప్రయత్నం చేసినా ఎవరూ వినిపించుకోలేదు. ఆనంను తోసి పడేశారు. దీంతో ఆనం కిందపడిపోయారు.

Tags:    
Advertisement

Similar News