నరసరావుపేట వైసీపీలో ఫ్లెక్సీ వార్

దశాబ్దాలుగా తమ కుటుంబానికి సొంత నియోజకవర్గంగా ఉన్న నరసరావుపేట సెగ్మెంట్‌పై కాసు మహేష్ దృష్టి పడినట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది.

Advertisement
Update: 2022-12-27 10:35 GMT

నరసరావుపేట వైసీపీలో వర్గ పోరు నడుస్తోంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మధ్య సీటు విషయంలో వివాదం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరువురి అనుచరులు పోటాపోటీగా నరసరావుపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

దశాబ్దాలుగా తమ కుటుంబానికి సొంత నియోజకవర్గంగా ఉన్న నరసరావుపేట సెగ్మెంట్‌పై కాసు మహేష్ దృష్టి పడినట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది.

ఇందుకు బలాన్నిచ్చేలా కాసు అభిమానులు భారీగా ఈసారి నరసరావుపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నరసరావుపేటకు కాసు మహేష్ రాక తమకెంతో ముఖ్యమంటూ ప్లెక్సీలు కట్టారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాసు మహేష్ పోటీ చేయాలంటూ భారీగా కరపత్రాలను పంచుకుతున్నారు. అటు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కూడా భారీగా ప్లెక్సీలు కట్టారు. నరసరావుపేట నుంచి గోపిరెడ్డిని కదిలించడం ఎవరి తరం కాదంటున్నారు.

గతంలో కాసు కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఒక శిలఫ‌లకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ పని ఎవరు చేసి ఉంటారన్న దానిపై వైసీపీలో పెద్ద చర్చ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News