చిరంజీవి గ్రీన్ సిగ్నల్

ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి ఏ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. జనవరి నుంచి షూటింగ్ కు రెడీ అవ్వమని మెహర్ రమేష్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే, వేదాళం రీమేక్ కోసం చిరంజీవి రెడీ అయినట్టే లెక్క. అంతేకాదు, జనవరి నుంచి ఇటు ఆచార్య, అటు వేదాళం రీమేక్ రెండూ కంటిన్యూ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది. మరో 4 రోజుల్లో ఆచార్య సినిమా సెట్స్ […]

Advertisement
Update: 2020-11-05 22:00 GMT

ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి ఏ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. జనవరి నుంచి షూటింగ్ కు రెడీ అవ్వమని మెహర్ రమేష్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే, వేదాళం రీమేక్ కోసం చిరంజీవి రెడీ అయినట్టే లెక్క. అంతేకాదు, జనవరి నుంచి ఇటు ఆచార్య, అటు వేదాళం రీమేక్ రెండూ కంటిన్యూ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది.

మరో 4 రోజుల్లో ఆచార్య సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఏకథాటిగా చేసే షెడ్యూల్స్ తో ఆ సినిమాను పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే, సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఫిబ్రవరి నాటికి ఆచార్యను పూర్తిచేయాల్సి ఉంది.

సో.. ఎలా చూసుకున్నా చిరంజీవి ఓ నెల రోజుల పాటు ఇటు ఆచార్య, అటు వేదాళం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి ఎప్పుడూ ఇలా రెండు సినిమాల్ని ఒకేసారి చేయలేదు. ఈసారి ఏం చేస్తారో చూడాలి.

Advertisement

Similar News