మళ్లీ ఒకే వేదిక పైకి.... బాహుబలి టీమ్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ అత్యంత భారీ కలెక్షన్లు అందుకొని రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా లో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు ఇప్పుడు తమ తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా విడుదలైన ఇన్నాళ్ళకు మళ్ళీ బాహుబలి బృందం ఒకే వేదిక మీద […]

Advertisement
Update: 2019-10-04 01:00 GMT

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ అత్యంత భారీ కలెక్షన్లు అందుకొని రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా లో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు ఇప్పుడు తమ తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా విడుదలైన ఇన్నాళ్ళకు మళ్ళీ బాహుబలి బృందం ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. బాహుబలి చిత్ర బృందం బ్రిటిష్ క్యాపిటల్ లండన్ లో ఇలా అందరూ ఒకే చోట కలవబోతున్నారు.

ఆఖరిసారిగా రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి లో కనిపించిన బాహుబలి బృందం ఇప్పుడు త్వరలో లండన్ కి వెళ్ళనుంది. అక్కడ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రీమియర్ కోసం చిత్ర బృందం హాజరవనుంది. సినిమాకి సంగీతం అందించిన కీరవాణి ఆర్కెస్ట్రా ఫర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ జరగబోతోందని సమాచారం.

సినిమాల పరంగా చూస్తే ప్రభాస్…. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, రానా ‘1945’, ‘హాథి మీరే సాథి’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనుష్క ‘సైలెన్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… తమన్నా ముఖ్య పాత్ర పోషించిన ‘సైరా’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News