మళ్లీ రిపీట్ అవ్వబోతున్న 'డాన్ శీను' కాంబినేషన్

గత కొంతకాలంగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వం వహించిన ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘విన్నర్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’ సినిమా తో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న మరొక హీరోతో చేయి కలపనున్నట్టు తెలుస్తోంది. ‘రాజా ది గ్రేట్’ సినిమా తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఆ […]

Advertisement
Update: 2019-06-03 05:35 GMT

గత కొంతకాలంగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వం వహించిన ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘విన్నర్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’ సినిమా తో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న మరొక హీరోతో చేయి కలపనున్నట్టు తెలుస్తోంది.

‘రాజా ది గ్రేట్’ సినిమా తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఆ తరువాత వరుసగా ‘నేల టికెట్’, ‘టచ్ చేసి చూడు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలతో డిజాస్టర్ లను నమోదు చేసుకున్నాడు.

తాజాగా గోపీచంద్ మలినేని రవితేజకి ఒక మంచి స్క్రిప్ట్ ను వినిపించినట్లు తెలుస్తోంది. రవితేజ కి ఈ సినిమా కథ బాగా నచ్చినట్లు… సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వం లో నటిస్తున్న ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత ఈ చిత్రాన్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని… నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం.

Tags:    
Advertisement

Similar News