రమ్య కృష్ణ తో సైలెంట్ గా ముగించిన గౌతం మీనన్

సెన్సేషనల్ ఫిలిం మేకర్ గౌతం మీనన్ ప్రస్తుతం కంప్లీట్ చేసిన సినిమాలే రిలీజ్ కి నోచుకోలేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆయన మాత్రం సైలెంట్ గా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేసుకుంటూ పోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన కూడా జయలలిత మీద వస్తున్న వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ లో ఒకటి చేస్తున్నారు. అందరూ ఆవిడ జీవితాన్ని సినిమా కింద మలచడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈయన మాత్రం ఆవిడ జీవితాన్ని ఒక వెబ్ సిరీస్ రూపం లో […]

Advertisement
Update: 2019-03-19 03:20 GMT

సెన్సేషనల్ ఫిలిం మేకర్ గౌతం మీనన్ ప్రస్తుతం కంప్లీట్ చేసిన సినిమాలే రిలీజ్ కి నోచుకోలేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆయన మాత్రం సైలెంట్ గా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేసుకుంటూ పోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఆయన కూడా జయలలిత మీద వస్తున్న వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ లో ఒకటి చేస్తున్నారు. అందరూ ఆవిడ జీవితాన్ని సినిమా కింద మలచడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈయన మాత్రం ఆవిడ జీవితాన్ని ఒక వెబ్ సిరీస్ రూపం లో తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, అందరూ ఇంకా మొదలే పెట్టకుండా ఉంటె… ఈయన మాత్రం రమ్యకృష్ణ తో సైలెంట్ గా షూటింగ్ చేసి చాలా భాగం పూర్తి చేసేశారట. సీజన్ల రూపం లో వివిధ భాషల్లో ఈ వెబ్ సిరీస్ రానుండడంతో గౌతం మీనన్ చాలా జాగ్రత్తగా ఈ సిరీస్ ని అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే లా తీస్తున్నారట.

సౌత్ లోని ఒక పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ఈ సిరీస్ ని నిర్మిస్తుండగా, పూర్తి వివరాలను గౌతం మీనన్ త్వరలో చెప్పనున్నారు.

Tags:    
Advertisement

Similar News