సిల్వర్ జూబ్లీ మూవీ ప్రకటించిన నాని

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన కెరీర్ లో 24వ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే అంతవరకు ఆగాల్సిన పనిలేదు. ఈ గ్యాప్ లోనే తన 25వ సినిమా వివరాల్ని బయటపెట్టాడు నేచురల్ స్టార్. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తన 25వ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు నాని. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎవరి […]

Advertisement
Update: 2019-02-25 23:10 GMT

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన కెరీర్ లో 24వ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే అంతవరకు ఆగాల్సిన పనిలేదు. ఈ గ్యాప్ లోనే తన 25వ సినిమా వివరాల్ని బయటపెట్టాడు నేచురల్ స్టార్.

దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తన 25వ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు నాని. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎవరి దర్శకత్వంలో అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చాడో, అదే వ్యక్తి దర్శకత్వంలో 25వ సినిమా చేయబోతున్నాడు. అతడే ఇంద్రగంటి మోహనకృష్ణ. అవును.. అష్టాచెమ్మా సినిమాతో నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి, తన నెక్ట్స్ సినిమాను నానితో చేయబోతున్నాడు. అది నానికి 25వ సినిమాగా మారింది.

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా. ఇందులో మెయిన్ హీరో సుధీర్ బాబు. ఓ కీలక పాత్రలో నాని కనిపించబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ వివరాల్ని నాని బయటపెట్టాడు. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News