పండగ రోజు మెగా అభిమానులకి పండగే

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా నరసింహారెడ్డి” సినిమా ఫారిన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అక్కడ చిరంజీవి మీద అలాగే మిగతా నటీనటుల మీద యుద్ద సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపోగానే మూవీ యూనిట్ మొత్తం హైదరాబాద్ కి వచ్చేస్తారు. వచ్చి రాగానే అంటే దసరా పండగ రోజు తన తదుపరి సినిమాని అనౌన్స్ చేస్తాడు మెగా స్టార్ చిరంజీవి. మెగా స్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని కొరటాల శివ […]

Advertisement
Update: 2018-10-06 00:50 GMT

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా నరసింహారెడ్డి” సినిమా ఫారిన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అక్కడ చిరంజీవి మీద అలాగే మిగతా నటీనటుల మీద యుద్ద సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపోగానే మూవీ యూనిట్ మొత్తం హైదరాబాద్ కి వచ్చేస్తారు.

వచ్చి రాగానే అంటే దసరా పండగ రోజు తన తదుపరి సినిమాని అనౌన్స్ చేస్తాడు మెగా స్టార్ చిరంజీవి. మెగా స్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తాడు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే వీళ్ళ కాంబినేషన్ కి సంభందించిన అధికారిక ప్రకటన దసరా రోజు ఇవ్వనున్నారు మూవీ యూనిట్.

ఇప్పటికే చిరంజీవి కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసుకొని రెడీ గా ఉన్నాడు కొరటాల శివ. ఒక్కసారి చిరంజీవి “సై రా” షూటింగ్ నుంచి ఫ్రీ అవ్వగానే ఈ సినిమా తాలూకు షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడు కొరటాల శివ. ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News