నాడు రంగా... నేడు ముద్రగడ " జోగయ్య ఫైర్

ముద్రగడ దీక్షవిషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కాపు నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు తీరును కాపు జాతి క్షమించదన్నారు. విజయవాడలో టీడీపీ మనుగడకు అడ్డుగా ఉన్నారన్న ఉద్దేశంతో వంగవీటి రంగా హత్యకు కారణభూతుడు చంద్రబాబేనని జోగయ్య ఆరోపించారు. ఇప్పుడు మాజీ మంత్రి ముద్రగడ విషయంలోనూ అదే తీరును చంద్రబాబు అనుసరిస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. వంగవీటి రంగా హత్యకు దారితీసిన పరిణామాలే మళ్లీ పునరావృతమైతే చంద్రబాబును కాపులు క్షమించే పరిస్థితి […]

Advertisement
Update: 2016-06-11 23:36 GMT

ముద్రగడ దీక్షవిషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కాపు నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు తీరును కాపు జాతి క్షమించదన్నారు. విజయవాడలో టీడీపీ మనుగడకు అడ్డుగా ఉన్నారన్న ఉద్దేశంతో వంగవీటి రంగా హత్యకు కారణభూతుడు చంద్రబాబేనని జోగయ్య ఆరోపించారు. ఇప్పుడు మాజీ మంత్రి ముద్రగడ విషయంలోనూ అదే తీరును చంద్రబాబు అనుసరిస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. వంగవీటి రంగా హత్యకు దారితీసిన పరిణామాలే మళ్లీ పునరావృతమైతే చంద్రబాబును కాపులు క్షమించే పరిస్థితి ఉండదని హరిరామజోగయ్య హెచ్చరించారు.

టీడీపీ మంత్రుల ఆరోపణలను జోగయ్య తిప్పికొట్టారు. కాపుల్లో ఎక్కువ శాతం మంది ముద్రగడ డిమాండ్‌ను సమర్థిస్తున్నారని చెప్పారు. తుని ఘటన పేరుతో అరెస్టులు చేసి కాపులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబుపై హరిరామజోగయ్య మండిపడ్డారు. కొన్నినెలల క్రితం హరిరామజోగయ్య రాసిన పుస్తకంలోనూ వంగవీటి రంగా హత్య చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. జోగయ్య పుస్తకం కాపుల్లో అలజడి రేపింది. చంద్రబాబును ఉలిక్కిపడేలా చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News