టీడీపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే, లోకేష్‌తో మంతనాలు

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు. విజయనగరం జిల్లాలో కీలక నేతగా ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణరంగారావు టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయినట్టు దాదాపు అన్ని మీడియా చానళ్లలో వార్తలొస్తున్నాయి. మంగళవారం లోకేష్‌తోనూ సుజయ్ కృష్ణ సమావేశం అయినట్టు తెలుస్తోంది. లోకేష్‌తో చర్చల అనంతరం పార్టీ మారడంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సుజయ్ కృష్ణతో పాటు ఆయన సోదరుడు బేబినాయన కూడా టీడీపీలో చేరనున్నారు.  ఈ రోజు సాయంత్రం విజయనగరంలో అనుచరులతో సుజయ్ కృష్ణ సమావేశం […]

Advertisement
Update: 2016-04-13 00:35 GMT

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు. విజయనగరం జిల్లాలో కీలక నేతగా ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణరంగారావు టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయినట్టు దాదాపు అన్ని మీడియా చానళ్లలో వార్తలొస్తున్నాయి. మంగళవారం లోకేష్‌తోనూ సుజయ్ కృష్ణ సమావేశం అయినట్టు తెలుస్తోంది. లోకేష్‌తో చర్చల అనంతరం పార్టీ మారడంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సుజయ్ కృష్ణతో పాటు ఆయన సోదరుడు బేబినాయన కూడా టీడీపీలో చేరనున్నారు. ఈ రోజు సాయంత్రం విజయనగరంలో అనుచరులతో సుజయ్ కృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో బొత్సా సత్యనారాయణను పార్టీలోకి తీసుకోవడంపై బొబ్బిలి రాజులు అసంతృప్తిగా ఉన్నారు. బొత్స పార్టీలో చేరిన తర్వాత వారు అసంతృప్తితో ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే సుజయ్ బ్రదర్స్ టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఈనెల 20న విజయనగరంలోని వైసీపీ ఎమ్మెల్యేలను సన్మానించాలని కూడా పార్టీ జిల్లా నాయకత్వం భావించింది. అయితే ఇంతలోనే సుజయ్‌ కృష్ణ పార్టీ మారుతున్నట్టు సమాచారం అందడంతో సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News