కాల్చి అవతల పడేస్తాం.. మరోసారి రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ ఇంటిమీద కాకి తమ ఇంటిపై వాలనీయం అన్నారు రేవంత్ రెడ్డి. ఒకవేళ వాలితే తుపాకి దెబ్బకు లేపి అవతల వేస్తామని హెచ్చరించారు.

Advertisement
Update: 2024-04-30 12:14 GMT

లాగుల్లో తొండలు ఇడుస్తా..

పండబెట్టి తొక్కుతా..

మూతి పళ్లు రాళగొడతా..

100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా..

పేగులు మెడలో వేసుకుంటా..

అంగీ లాగు ఊడతీసి చిప్పకూడు తినిపిస్తా

తెలంగాణ సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ పలు సందర్భాల్లో నిలదీశారు బీఆర్ఎస్ నేతలు. అయితే రేవంత్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. తాజాగా తుపాకితో కాల్చి అవతల పడేస్తామంటూ మరింత ఘాటుగా మాట్లాడారు.


కేసీఆర్ ని ఇండియా కూటమిలోకి రానీయబోమంటూ తాజాగా లోక్ సభ ప్రచార సభలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంటిమీద కాకి తమ ఇంటిపై వాలనీయం అన్నారు. ఒకవేళ వాలితే తుపాకి దెబ్బకు లేపి అవతల వేస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలాయి. లోక్ సభ ఎన్నికల నాటికి ఆ మాటల యుద్ధం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి శాంతించడంలేదు. పదే పదే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటలపై కేసీఆర్ కూడా పలు సభలలో ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ సాధించిన నాయకుడిని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తనపై రేవంత్ రెడ్డి ఎలాంటి భాష వాడుతున్నారో గమనించాలని ఆయన ప్రజలకు సూచించారు. అయినా కూడా ఈ మాటల యుద్ధం ఆగడంలేదు. రేవంత్ వ్యాఖ్యలతో ఇది నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. 

Tags:    
Advertisement

Similar News