గిడ్డి ఈశ్వరికి మంత్రి పదవి ఆఫర్

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తనను అధికార పార్టీ అనేక విధాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా టీడీపీ ప్రలోభాల గురించి వివరించారు. టీడీపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారని ఈశ్వరి వెల్లడించారు. పదవితో పాటు కోట్లాది రూపాయల నగదు ఇస్తామని అధికారపార్టీ ఆఫర్ చేసిందన్నారు.  కానీ అలాంటి ప్రలోభాలకు తాను లొంగబోనని […]

Advertisement
Update: 2016-04-11 22:43 GMT

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తనను అధికార పార్టీ అనేక విధాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా టీడీపీ ప్రలోభాల గురించి వివరించారు.

టీడీపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారని ఈశ్వరి వెల్లడించారు. పదవితో పాటు కోట్లాది రూపాయల నగదు ఇస్తామని అధికారపార్టీ ఆఫర్ చేసిందన్నారు. కానీ అలాంటి ప్రలోభాలకు తాను లొంగబోనని చెప్పారు. జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతోనే పోరాటం చేస్తానన్నారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.

ఇటీవల మరో వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా తాను పార్టీ మారితే రూ. 20 కోట్లు ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్ధపడిందని కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, పేద ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఆర్థిక బలంతో గాలమేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News