టీడీపీ నుంచి గుండు సుధారాణి సస్పెన్షన్‌

తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. సుధారాణి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలు, దీనికి తోడు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆమె సమావేశమైన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. దీంతో ఆమె కారెక్కడం ఖాయమని నిర్ణయించుకున్న టీడీపీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమెపై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ […]

Advertisement
Update: 2015-10-29 06:48 GMT

తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. సుధారాణి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలు, దీనికి తోడు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆమె సమావేశమైన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. దీంతో ఆమె కారెక్కడం ఖాయమని నిర్ణయించుకున్న టీడీపీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమెపై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Tags:    
Advertisement

Similar News