రూపాయే కాదు నిర్మలా సీతారామన్ కూడా పతమనమంచులో ఉన్నారు -కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాంత్రిక పూజల ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటి వరకు రూపాయి పతనం అవుతుందనుకున్నాను, ఆర్థిక మంత్రి కూడా పతనమంచులో ఉన్నారు అని కేటీఆర్ ద్వజమెత్తారు.

Advertisement
Update: 2022-10-08 17:47 GMT


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రికుల సలహా మేరకే సచివాలయం వెళ్ళడం లేదని, మహిళలను మంత్రివర్గంలో నియమించడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఒక వైపు ఈ ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్మాలా సీతారామన్ కు జవాబువ్వగా కొద్ది సేపటి క్రితం కేటీఆర్ కూడా స్పందించారు. ఆమె వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పూర్తిగా దిగజారిపోయారని విమర్శించారు. ఆయన ట్వీట్ లో..

''రూపాయి మాత్రమే పతనంలో ఉందని నేను అనుకున్నాను

ఆర్థిక శాఖామంత్రి మేడమ్ నిర్మల గారు కూడా పతనం అంచుల్లో ఉంన్నారు...మరీ ఇంత పతనమా ?

ఇవి జుమ్లానోమిక్స్ యొక్క వినాశకరమైన దుష్ప్రభావాలు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News