సారూ రూల్స్‌ పెడతారు.. ఫాలో అవరు

Advertisement
Update: 2024-05-05 12:05 GMT

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు వచ్చేవాళ్లు వాహనాలను బ్రిడ్జిపైనే ఆపి ఫొటోలు దిగడం, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చేస్తున్నారు. దీంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జిపై వేడుకలను నిషేధించారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫైన్లు కూడా వేస్తున్నారు.

తానే రూల్స్ పెట్టి..

ఇంత వరకు బాగానే ఉన్నా.. మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఇదే కేబుల్ బ్రిడ్జిపై తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రూల్స్ ప్రజలకు మాత్రమే.. మాకు కాదు అనేలా వ్యవహరించారు. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారడంతో సీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. స్వయంగా సీఐ మల్లేషే నెలకిందట కేబుల్ బ్రిడ్జ్‌పై వేడుకలు నిషేధం అని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు పెడుతామని, వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు. తీరా ఇపుడు ఆయనే నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC