కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొన్న బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

మృతులిద్దరూ వెంకటాపూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నరేష్ అనే యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. పరశరాములు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Update: 2024-05-06 14:10 GMT

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ఢీ కొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులిద్దరూ వెంకటాపూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నరేష్ అనే యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. పరశరాములు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ పరశ‌రాములు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్‌ బెలూన్‌లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయనకు సమీప హాస్పిటల్‌లో చికిత్స అందించారు. 

Tags:    
Advertisement

Similar News