కిషన్‌రెడ్డి, బండికి కేటీఆర్ రాజీనామా సవాల్..

నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మించి మోసం చేయడం అన్నారు కేటీఆర్. నల్లధనం తెచ్చిండా, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అని ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-05-06 07:07 GMT

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పోటీలోనే లేదన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్లకే తెలియదని, ఇంక జనమేం గుర్తుపడుతారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా సిరిసిల్లలో రోడ్‌షో నిర్వహించారు కేటీఆర్. బీజేపీ వాళ్లు పచ్చి లంగలు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేవుడి పేరు చెప్పి మోసం చేయడం తప్ప రూపాయి అభివృద్ధి చేయరన్నారు. అక్షింతలు, రాముడు అనగానే బీజేపీ ట్రాప్‌లో పడొద్దన్నారు. బండి సంజయ్‌వి గాలి మాటలు, గాలి పనులు తప్ప ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేయలేదన్నారు కేటీఆర్.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి సవాల్‌..

నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మించి మోసం చేయడం అన్నారు కేటీఆర్. నల్లధనం తెచ్చిండా, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ అన్నాడు.. మాములు రైలుకే దిక్కులేదన్నారు కేటీఆర్‌.

సిరిసిల్ల నేతన్నల కోసం మోడీని పదిసార్లు సాయం అడిగితే.. పది పైసల సాయం కూడా చేయలేదన్నారు. 30లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరి నుంచి దోచుకుని తన దోస్తులైన అదానీ, అంబానీలకు అప్పులు మాఫీ చేశారన్నారు. ఇది నిజం కాదని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిరూపిస్తే.. రేపే సిరిసిల్ల కొత్త బస్టాండ్ దగ్గర తన రాజీనామా లేఖ పెడతానంటూ సవాల్ విసిరారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News