రేవంత్‌కు షాక్‌.. మల్లు రవి రాజీనామా

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది రేవంత్ సర్కార్. జనవరి 28న ఆయన ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
Update: 2024-02-23 13:59 GMT

కాంగ్రెస్‌ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడవక ముందే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది రేవంత్ సర్కార్. జనవరి 28న ఆయన ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అయితే నాగర్‌కర్నూలు ఎంపీ సీటు ఆశిస్తున్నానని.. అవసరమైతే ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించారు.

తనకు పోటీ చేసేందుకు ఇదే చివరి అవకాశమని ప్రకటించారు మల్లు రవి. నాగర్‌ కర్నూలు నుంచి తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. నాగర్‌ కర్నూలు ఎంపీ టికెట్ కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌, మల్లు రవి మధ్య పోటీ ఉంది.

Tags:    
Advertisement

Similar News