ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతూనే ప్రియుడు ఆత్మహత్య.. ఎక్కడంటే

ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు.. ఆమెతో ఫోనులో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ విషాదకర సంఘటన.

Advertisement
Update: 2024-05-09 08:15 GMT

ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు.. ఆమెతో ఫోనులో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ విషాదకర సంఘటన. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం..

తాండూరుకు చెందిన ఇమ్రోజ్‌ పటేల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నఇమ్రోజ్‌ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని పరమారెడ్డి హిల్స్‌లో అద్దెకు ఉంటున్నాడు.  అత్తాపూర్‌కు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే గత కొన్నిరోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టింది.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్‌పటేల్‌ మంగళవారం రాత్రి తాను నివసించే ఫ్లాట్‌ నుంచి ఆ యువతికి ఫోన్‌ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన యువతి సమీపంలోని కాంతారెడ్డినగర్‌లో ఉంటున్న స్నేహితుడు కృష్ణకాంత్‌కు పోన్‌చేసి విషయం చెప్పింది. ఇమ్రోజ్‌పటేల్‌ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. కానీ అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరివేసుకొని ఇమ్రోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సాజిద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News