రాష్ట్ర‌పతికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన సీఎం కేసీఆర్

శీత‌కాల విడిది కోసం ముర్ము ఇవాళ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌పతి అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకునేందుకు వెళ్లారు. అనంతరం తిరిగి ఆమె హకీం పేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Advertisement
Update: 2022-12-26 12:10 GMT

భారత రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం నుంచి హకీం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాష్ట్ర‌ప‌తిని శాలువాతో స‌త్క‌రించి, పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగతం ప‌లికారు కేసీఆర్. కేసీఆర్ తో పాటు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన వారిలో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఆర్మీ, నేవీ అధికారులు ఉన్నారు. అనంత‌రం రాష్ట్రపతి భార‌త సైనికుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. 

శీత‌కాల విడిది కోసం ముర్ము ఇవాళ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌పతి అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకునేందుకు వెళ్లారు. అనంతరం తిరిగి ఆమె హకీం పేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News