మళ్లీ తెలంగాణకు తమిళి సై.. ఈసారి కొత్త బాధ్యతలు!

ఈసారి తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తమిళి సై. కేంద్రంలో తెలంగాణ నుంచి ఈసారి ఎక్కువ మంది కేంద్రమంత్రులు ఉంటారని చెప్పుకొచ్చారు.

Advertisement
Update: 2024-04-30 02:46 GMT

మాజీ గవర్నర్ తమిళి సై మరోసారి తెలంగాణకు వచ్చారు. ఈసారి ఆమె బీజేపీ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళి సై.. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై సౌత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ పోలింగ్ ముగియడంతో ప్రచార బాధ్యతల నిమిత్తం తెలంగాణకు వచ్చారు.

ఈసారి తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తమిళి సై. కేంద్రంలో తెలంగాణ నుంచి ఈసారి ఎక్కువ మంది కేంద్రమంత్రులు ఉంటారని చెప్పుకొచ్చారు. చెన్నై సౌత్‌లో హోరాహోరి పోరు సాగినా.. గెలుపు తనదేనన్నారు తమిళి సై.

ఇక కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్‌ఛార్జిగా తమిళిసైని నియమించింది బీజేపీ హైకమాండ్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తమిళ ఓటర్లు ఉండడమే ఇందుకు కారణం.

Tags:    
Advertisement

Similar News