పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్‌ వదిలిన దుండగులు

లోక్‌సభ జరుగుతున్న స‌మ‌యంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చారు. షూ నుంచి టియర్ గ్యాస్ క్యాన్లను తీసి సభ్యులపై వదిలారు.

Advertisement
Update: 2023-12-13 09:24 GMT

దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భలో భద్రతా వైఫల్యం బయటపడింది. లోక్‌సభలోకి చొరబడ్డ ఇద్దరు దుండగులు టియర్ గ్యాస్ వదలడం కలకలం సృష్టించింది. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఈ షాకింగ్ ఘటనతో సభలోని ఎంపీలంతా ఉలిక్కిపడ్డారు. భయంతో బ‌య‌ట‌కు పరుగులు తీశారు. దీంతో వెంట‌నే లోక్‌సభను వాయిదా వేశారు స్పీకర్‌.

లోక్‌సభ జరుగుతున్న స‌మ‌యంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చారు. షూ నుంచి టియర్ గ్యాస్ క్యాన్లను తీసి సభ్యులపై వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరు దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంట్‌పై అటాక్ చేస్తామంటూ ఖలీస్తాన్ తీవ్రవాదులు ఈమధ్యే హెచ్చరించారు. తాజాగా ఈ ఘటన జరగడంతో ఇది ఖలీస్తానీ వాళ్ల పనే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 2001లోనూ సరిగ్గా ఇదే రోజు పార్లమెంట్‌పై అటాక్ జరిగింది.

Tags:    
Advertisement

Similar News