ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, మ‌రొకరి పరిస్థితి విషమం

ఒక్కసారిగా ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో పేలుడు తీవ్రతకు ఘటనాస్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Update: 2024-03-24 03:32 GMT

ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లా బస్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కెమికల్‌ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు జిల్లా కలెక్టర్‌ ప్రకాశ్‌ రాజు రోహిత్‌ తెలిపారు.

ఒక్కసారిగా ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో పేలుడు తీవ్రతకు ఘటనాస్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఒక వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని, అతనికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News