కీప్ ఇట్ అప్.. జగన్ పై పవన్ కల్యాణ్ సెటైర్

పవన్ వేసిన ఫ్రెష్ ట్వీట్, వైసీపీకి మంట పెట్టేలా ఉంది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. అంబటి, పేర్ని, రోజా.. ఎవరు ముందుగా పవన్ పై మాటల తూటాలు వదులుతారో, ట్విట్టర్ బాణాలు సంధిస్తారో మరి కాసేపట్లో తేలిపోతుంది.

Advertisement
Update: 2023-02-07 07:51 GMT

పవన్ కల్యాణ్ మళ్లీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ పై సెటైర్ పేల్చారు. అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కీప్ ఇట్ అప్ సీఎం గారూ అంటూ ఛలోక్తులు విసిరారు.

ఆమధ్య వారాహి పూజల తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదు. పార్టీ యాక్టివిటీస్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. ఫిబ్రవరి 1 తర్వాత ట్విట్టర్ కి కూడా కాస్త విరామం ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ సీఎం జగన్ పై ట్వీట్ వేసి వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారు. ట్వీట్ కి తోడు ఓ ఫన్నీ కార్టూన్ ని కూడా జతకలిపారు పవన్ కల్యాణ్. ఏపీ సీఎం జగన్ కి అప్పు రత్న అవార్డు వచ్చినట్టు, భారత రత్నలాగా ఇది ప్రతిష్టాత్మకమైన అవార్డ్ అంటూ నాయకులు, అధికారులు చెవులు కొరుక్కుంటున్నట్టుగా అందులో ఉదహరించారు.


అంతే కాదు.. రాష్ట్ర సంపద, జగన్ వ్యక్తిగత సంపద అంటూ మరింత వ్యంగ్యంగా ఇంగ్లిష్ లో ట్వీట్ వేశారు పవన్ కల్యాణ్. రాష్ట్ర సంపద ఎటు పోతున్నా.. జగన్ తన వ్యక్తిగత సంపద పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టారని, అందుకే ఆయన రిచ్చెస్ట్ సీఎం గా ఎంపికయ్యారన చెప్పారు పవన్ కల్యాణ్. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, అదే సమయంలో కేవలం తన ఆస్తిని మాత్రమే పెంచుకోవడం.. ఇదీ జగన్ పాలన అంటూ ట్వీట్ వేశారు పవన్ కల్యాణ్.

పవన్ వేసిన ఫ్రెష్ ట్వీట్, వైసీపీకి మంట పెట్టేలా ఉంది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురుదాడి కచ్చితంగా మొదలవుతుంది. మరి ఆ దాడిని ముందుగా ఎవరు మొదలు పెడతారో చూడాలి. అంబటి, పేర్ని, రోజా.. ఎవరు ముందుగా పవన్ పై మాటల తూటాలు వదులుతారో, ట్విట్టర్ బాణాలు సంధిస్తారో మరి కాసేపట్లో తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News