'తుప్పు పట్టిన సైకిల్'.. జగన్ సెటైర్లు మామూలుగా లేవు

చంద్రబాబుపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తూ ర్యాగింగ్ చేశారు సీఎం జగన్. తుప్పు పట్టిన సైకిల్ ని రిపేర్ చేసేందుకు బాబు పడుతున్న కష్టాలను వివరించారు.

Advertisement
Update: 2024-05-07 08:39 GMT

రాజానగరం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్.. 'తుప్పుపట్టిన సైకిల్' అంటూ ఓ చిన్న కథ చెప్పారు. చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. తుప్పు పట్టిన సైకిల్ లో మిగిలింది కేవలం బెల్ మాత్రమేనని.. అబద్ధాల మేనిఫెస్టో అనే బెల్ ని చంద్రబాబు మోగిస్తున్నారని, ఆ మాయలో పడొద్దని ప్రజలకు హితవు పలికారు జగన్.


"అనగనగా ఓ తుప్పుపట్టిన సైకిల్.. ఆ సైకిల్ యజమాని చంద్రబాబు దాన్ని రిపేర్ చేసేందుకు కష్టపడుతున్నారు. ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు. ఫలితం లేదు. ఆ తర్వాత దత్త పుత్రుడిని పిలిచారు, దత్త పుత్రుడు సైకిల్ అంతా చూసి, ఇది తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకుని తాగుతూ కూర్చుంటానన్నారు. తర్వాత వదినమ్మతో మాట్లాడి ఢిల్లీ మెకానిక్ లను రంగంలోకి దింపారు. తుప్పు పట్టిన సైకిల్ చూసిన ఢిల్లీ మెకానిక్ లు పనికాదన్నారు. ఆ సైకిల్ కు హ్యాండిల్ లేదు, సీట్ లేదు, చక్రాలు లేవు, ట్యూబ్ లేదు.. ఇలాంటి సైకిల్ ని ఎలా బాగు చేస్తామని చంద్రబాబుని ఢిల్లీ మెకానిక్ లు అడిగారు. చంద్రబాబు పిచ్చి చూపులు చూసి, ఇదొక్కటే మిగిలింది అని బెల్లు చూపించారు. ఆ బెల్లుపేరు అబద్ధాల మేనిఫెస్టో.." అంటూ వివరించారు సీఎం జగన్.

చంద్రబాబుపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తూ ర్యాగింగ్ చేశారు సీఎం జగన్. తుప్పు పట్టిన సైకిల్ ని రిపేర్ చేసేందుకు బాబు పడుతున్న కష్టాలను వివరించారు. అదే సమయంలో బెల్లు మాత్రమే చూపిస్తూ సైకిల్ ఉన్నట్టు చంద్రబాబు భ్రమ కల్పిస్తారని కూడా హెచ్చరించారు జగన్. ఆ భ్రమల్లో పడొద్దని, చంద్రబాబు దగ్గర బెల్ మాత్రమే ఉందని, సైకిల్ మొత్తం పాడైపోయిందన్నారు. 

Tags:    
Advertisement

Similar News