కుప్పంలో ఓడిపోతానని తెలిసే బాబులో అసహనం.. - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసీపీ హంద్రీనీవా పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందని, అందుకే పూర్తి కాలేదని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2024-04-27 02:01 GMT

చంద్రబాబుకు కుప్పంలో ఓడిపోతానని తెలియడం వల్లే అసహనానికి లోనవుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అందుకే ఆయన తిట్ల పురాణానికి తెర తీశారని చెప్పారు. పుంగనూరు నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పంకు చేసింది ఏమీ లేదని పెద్దిరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరందిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ హంద్రీనీవా పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందని, అందుకే పూర్తి కాలేదని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

రాయలసీమలోనే పుట్టిన పార్టీ వైసీపీ..

రాయలసీమ నుంచి వైసీపీని తరిమికొట్టాలని ప్రచారంలో భాగంగా చంద్రబాబు పిలుపునిచ్చారని మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందే రాయలసీమలో అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాయలసీమ కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని ఆయన చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, పవన్‌లకు సీఎం వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేయడం తప్ప మరో కార్యక్రమం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వారు చేసిందేమీ లేదు కాబట్టే.. చెప్పుకోవడానికి ఏమీ లేక తిట్లపురాణం అందుకున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. తమపై వారు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలే ఓట్ల రూపంలో వారందరికీ బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News