కుప్పం ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేస్తారు జాగ్రత్త..

కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు పెద్దిరెడ్డి.

Advertisement
Update: 2024-05-08 07:34 GMT

కుప్పం ప్రజలు ఈసారి చంద్రబాబుని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి.

కుప్పంలో వైసీపీ బలపడుతున్న నేపథ్యంలో చంద్రబాబుకి భయం పట్టుకున్న మాట వాస్తవం. స్థానిక సంస్థల ఎన్నికలతో కుప్పంలో వైసీపీ హవా మొదలైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా టీడీపీ నేతలంతా వైసీపీలోకి వలసబాట పట్టారు. దీంతో చంద్రబాబులో భయం మొదలైంది. భరత్ తనకు ధీటైన అభ్యర్థిగా మారుతున్నారని తెలియడంతో కుప్పంలో కుటుంబాన్ని దింపారు బాబు. నారా భువనేశ్వరి కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు కూడా కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక కుప్పంలో టీడీపీ కూసాలు కదల్చడంలో పెద్దిరెడ్డిది కీలక పాత్ర అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఆయన్ను టార్గెట్ చేశారు చంద్రబాబు. పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, ఎల్లో మీడియాతో వంత పాడిస్తున్నారు.

ఇటీవల ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సహా మరో ఎస్సైని బదిలీ చేయించింది టీడీపీ బ్యాచ్. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శల జోరు పెంచారు చంద్రబాబు. పెద్దిరెడ్డి వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై పెద్దిరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News