జనసేనలో చేరతానని చెప్పలేదు - యాంకర్ అనసూయ క్లారిటీ

ఈ వార్తలపై తాజాగా అనసూయ స్పందించారు. తాను జనసేన పార్టీలో చేరతానని, ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Update: 2024-03-29 13:43 GMT

తాను జనసేన పార్టీలో చేరతానని చెప్పలేదని ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ స్పష్టం చేశారు. అనసూయ జనసేన పార్టీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన లీడర్ పవన్ కళ్యాణ్ అని.. ఆయన స్వయంగా కోరితే జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఓ ఇంటర్వ్యూలో అనసూయ అన్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా అనసూయ స్పందించారు. తాను జనసేన పార్టీలో చేరతానని, ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. తాను తుమ్మినా, దగ్గినా కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాను రాజకీయాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నాయకుడు నచ్చి ఆయన అజెండా నచ్చితే తప్పకుండా ప్రోత్సహిస్తానని చెప్పినట్లు తెలిపారు.

అంతేకానీ పార్టీలో చేరతానని, ప్రచారం చేస్తానని మాత్రం తాను చెప్పలేదన్నారు. జనసేన పార్టీలో చేరతానని చెప్పలేదని.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పలేదని.. చెప్పిన అనసూయ జనసేన పార్టీ అజెండా మాత్రం తనకెంతో నచ్చినట్లు చివరగా చెప్పడం గమనార్హం. అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2తో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News